పనుల్లో నాణ్యత పాటించాలి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

78చూసినవారు
పనుల్లో నాణ్యత పాటించాలి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులలో నాణ్యత పాటించాలని అధికారులను ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తోమాలపల్లి గ్రామ పాఠశాలలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ నిర్వహించి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. పాఠశాలలో చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్