యూజర్లను ఆకర్షించడంలో భాగంగా సోషల్ మీడియా సంస్థ లింక్డిన్.. ఇప్పుడు గేమింగ్ రంగంలోకి ప్రవేశించింది. తమ ప్లాట్ఫామ్పై మూడు గేమ్స్ను తీసుకొచ్చింది. పిన్పాయింట్, క్రీన్స్, క్రాస్క్లైంబ్ పేరిట వీటిని ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు మొబైల్ యాప్, వెబ్సైట్లో వీటిని ఆడొచ్చు. మెదడుకు పదును పెట్టేలా లింక్డిన్ ఈ గేమ్స్ను రూపొందించింది.