ప్రియురాలిని కాల్చి చంపి.. ప్రేమికుడు ఆత్మహత్య

63చూసినవారు
ప్రియురాలిని కాల్చి చంపి.. ప్రేమికుడు ఆత్మహత్య
యూపీలోని అమ్రోహాలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియురాలికి పెళ్లి కుదిరిందన్న కోపంతో ఓ ప్రేమికుడు ఆ యువతిని దారుణంగా కాల్చి చంపి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవక్తపూర్ గ్రామానికి చెందిన తేజ్‌పాల్‌ కుమారుడు ఆయుష్‌(22), షాహిద్‌పూర్ గ్రామానికి చెందిన యవతిని ప్రేమించాడు. సదరు బాలికను తన వెంట రావాలని ఆయుష్‌ కోరాడు. అయితే బాలిక నిరాకరించడంతో ఆయుష్ ఆమెను హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్