ఏపీలో వరద బీభత్సం ఇదీ.. ఎంత నష్టం జరిగిందంటే?

66చూసినవారు
ఏపీలో వరద బీభత్సం ఇదీ.. ఎంత నష్టం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని అకాల వర్షాలు సృష్టించిన జల ప్రలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,69,370 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం జరిగింది. 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. 60 వేల కోళ్లు మృతి చెందగా.. 275 పశువులు మృతి చెందాయి. 3,973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. వర్షం వరదల వలన 6,44,536 మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.

సంబంధిత పోస్ట్