బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.750 పెరిగి రూ.64,100కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.760 పెరిగి రూ.69,870 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2000 పెరగడంతో రూ.84000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.