ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల విషయంలో త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వానికి మించి కూటమి సర్కారు సంక్షేమం అందిస్తోందని, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.వెయ్యి పెంచగా, కూటమి అధికారంలోకి రాగానే వెయ్యి పెంచి మూడు నెలలతో కలిపి మొత్తం రూ.7 వేలు ఇస్తుందని పేర్కొన్నారు.