భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇస్తూ షాకిచ్చాడు. అయితే ఇతర ఫార్మాట్లలో తన కెరీర్ను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. మరోవైపు నిన్న ప్రపంచకప్ టీ20 విజేతగా నిలిచిన అనంతరం భారత స్టార్లు రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఒకేసారి ముగ్గురు భారత దిగ్గజ క్రికెటర్లు పొట్టి క్రికెట్కు గుడ్ బై చెప్పారు.