అయోధ్య రామభక్తులకు శుభవార్త

63చూసినవారు
అయోధ్య రామభక్తులకు శుభవార్త
అయోధ్య వెళ్లి బాలరాముడిని దర్శించుకోలేని వారికి దూరదర్శన్ ఛానల్ శుభవార్త చెప్పింది. రామ్ లల్లా భక్తులు ప్రతిరోజూ అయోధ్య నుంచి నేరుగా హారతి సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని డీడీ ఛానల్ వెల్లడించింది. ఉదయం 6:30 గంటలకు అయోధ్యలోని రామ మందిరం నుంచి రోజు వారి హారతి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని దూరదర్శన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్