మహారాష్ట్రలోని పుణె సమీపంలో దారుణం జరిగింది. ఉద్యోగం వల్ల 25 ఏళ్ల వివాహిత భర్త వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో పిల్లలను చంపేస్తానని బెదిరించి వివాహితపై సూరజ్ హుల్వాన్ అత్యాచారం చేశాడు. డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 మధ్య పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ శశికాంత్ చవాన్ తెలిపారు.