ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్గా టీమిండియా యంగ్స్టార్ యశస్వీ జైస్వాల్ నిలిచాడు. ఫిబ్రవరి నెల ప్రదర్శనకు గానూ ఆయనకు ఈ అవార్డు వరించింది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ నిస్సాంక నుంచి పోటీ ఎదురైనా జైస్వాల్కే అవార్డు దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో జైస్వాల్ 89 సగటుతో 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.