ప్రముఖ భారత ఫుట్బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు భైచుంగ్ భూటియా మంగళవారం ప్రకటించారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ఆయన డార్జిలింగ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2018లో హమ్రో సిక్కిం పార్టీని స్థాపించాడు. గతేడాది పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్డీఎఫ్ పార్టీలో విలీనం చేశాడు.