మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీలో తాగునీటి సమస్యపై బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా నగరంలో నీటి కొరత సమస్యలను పరిష్కరించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మంచి నీటి సమస్యపై 2017 నుంచి మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ను లేఖకు జతచేస్తూ.. నగరంలో నీటి సమస్య తీవ్రతను వివరించారు.