ప్రభుత్వమే బాధ్యత వహించాలి: రాహుల్ గాంధీ

68చూసినవారు
ప్రభుత్వమే బాధ్యత వహించాలి: రాహుల్ గాంధీ
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. గతకొన్ని నెలలుగా భారత ఆర్మీపై ఉగ్రదాడులు పెరగడం ఆందోళనకరం అని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి భద్రతా వైఫల్యానికి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. బీజేపీ తప్పులు, విధానాల భారం అక్కడి సైనికులు, ప్రజలపై పడిందని దుయ్యబట్టారు. ఈ భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్