ఆయిల్‌పామ్, బిందుసేద్యం రాయితీలకు నిధులు మంజూరు

50చూసినవారు
ఆయిల్‌పామ్, బిందుసేద్యం రాయితీలకు నిధులు మంజూరు
ఆయిల్‌పామ్‌ సాగు, బిందుసేద్యం, వెదురు సేద్యం పథకాల రాయితీలకు నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఆయిల్‌పామ్‌ రైతులు, కంపెనీలకు 2024-25 సంవత్సరానికి మొదటి విడతగా రూ.176 కోట్లు, బిందు సేద్యం కింద రూ.51.66 కోట్లు, వెదురు పథకం కింద రూ.16.47 లక్షల మంజూరుకు అనుమతులిచ్చింది. మొత్తం 227.66 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్