రోడ్డు ప్రమాదంలో వరుడు సజీవదహనం

57చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వరుడు సజీవదహనం
యూపీలోని ఝాన్సీలో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. వరుడు ఆకాష్ సహా కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనం అయ్యారు. వరుడు ఆకాష్ పెళ్లి శుక్రవారం జరిగింది. పెళ్లి అనంతరం తన భార్య, సోదరుడు, మేనల్లుడు సహా ఆరుగురితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రమాదం తర్వాత కారులోంచి ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్