నూతన సంవత్సరం ప్రారంభ రోజున గుజరాత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ మంది సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర
మోదీ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'యోగా పట్ల మనకున్న నిబద్ధతకు, మన సాంస్కృతిక వారసత్వానికి ఇది నిదర్శనం’ అంటూ ప్రధాని రాసుకొచ్చారు.