భారత అల్ట్రా మారథాన్ రన్నర్ సుమిత్ సింగ్ గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఒడిశాకు చెందిన అతడు ట్రెడ్ మిల్పై ఏకంగా 12 గంటల పాటు ఆపకుండా పరుగెత్తి ఈ ఘనత సాధించారు. మార్చి 12న ఉదయం 8.15 గంటలకు పరుగు ప్రారంభించి రాత్రి 8.20 గంటల వరకు కొనసాగించారు. మొత్తంగా 68.04 కి.మీ పరుగెత్తడంతో తాజాగా అతడికి గిన్నిస్లో చోటు లభించింది.