పాకిస్థాన్లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్స్టేషన్ పీఎన్ఎస్ సిద్ధిఖ్పై సోమవారం రాత్రి ఉగ్రదాడి జరిగింది. పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో స్థావరంపై దాడిచేశారు. అప్రమత్తమైన సైనికులు, పోలీసులు వెంటనే ఎదురుకాల్పులు జరిపి.. నలుగురు తీవ్రవాదులను హతమార్చారు. ఎయిర్స్టేషన్కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్దఎత్తున మోహరించినట్లు సమాచారం.