గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి అస్వస్థత

77చూసినవారు
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి అస్వస్థత
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతనికి చికిత్స అందించేందుకు జైలు నుంచి బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అన్సారీకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మెడికల్ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొద్దిరోజుల క్రితం ముఖ్తార్ అన్సారీ తన ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టుకు తెలియజేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్