కృషి ఉంటే మనిషి సాధించలేనిదంటూ ఉండదని నిరూపించాడు చెన్నైలోని మడిపాక్కంకి చెందిన ఏలుమలై శరత్బాబు. తల్లి, నలుగురు తోబుట్టువులతో కలసి కటిక పెదరికంతో మురికి వాడలో జీవించి.. ఆయన ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తి. శరత్బాబు చిన్నప్పటి నుండి కష్టపడి చదివి అహ్మదాబాద్ ఐఐఏంలో MBA సాధించాడు. లక్షల్లో జీతాలు వదులుకొని తను పెరిగిన మురికి వాడల్లో 'ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్' సర్వీస్ పెట్టి తనలాంటి పేద యువకులకు ఉద్యోగాలు కల్పించాడు. ఇప్పుడు 8 కోట్ల టర్నోవర్తో వ్యాపారాన్ని చేస్తున్నాడు.