మణిపూర్‌లో 3.9 తీవ్రతతో భూకంపం

83చూసినవారు
మణిపూర్‌లో  3.9 తీవ్రతతో భూకంపం
మణిపూర్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మణిపూర్‌లోని ఉఖ్రుల్ సమీపంలో శుక్రవారం ఉదయం 6.56 గంటలకు 3.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్