ఎలక్టోరల్ బాండ్ల వల్ల బిజెపి కోట్లాది రూపాయల్ని వెనుకేసుకుందని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని శివసేన (యుబిటి) నేత సంజరు రౌత్ తీవ్రంగా విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంపై సంజరురౌత్ శుక్రవారం మాట్లాడుతూ.. ‘గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తాయి. ఆ నిధులను నేరుగా బీజేపీ ఖాతాల్లోకి పంపిస్తాయన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం’ అని సంజరురౌత్ బిజెపిపై తీవ్రంగా ఆరోపించారు.