లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న విచారించనుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) తనను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించడాన్ని కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఏప్రిల్ 9న హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టి వేసింది. తర్వాత రోజు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.