అసోంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 10 జిల్లాల్లోని సుమారు ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. నదీ జలాల నీటి మట్టం ఉప్పొంగడంతో బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. ఆయా ఘటనల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.