మొదటగా ఫిర్యాదు చేసి ఆ తర్వాత నిందితులతో రాజీ చేసుకుని కేసును విత్డ్రా చేసుకునే వారిపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారివల్ల అధికారులకు, కోర్టులకు సమయం వృథా అవుతోందని పేర్కొంది. ఇలాంటి వారికి భారీ మూల్యం విధించేలా బలమైన యంత్రాంగాన్ని రూపొందించాలని అభిప్రాయపడింది. ఇకపై తమ దృష్టికి వచ్చే అలాంటి కేసులపై తగిన విధంగా తీర్పునిస్తామని తేల్చిచెప్పింది.