భారీ వర్షాలు.. డ్రెయిన్‌లో పడి 45 ఏళ్ల మహిళ మృతి (వీడియో)

64చూసినవారు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన జరిగింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంధేరీలోని MIDC ప్రాంతంలోని ఓపెన్ డ్రెయిన్‌లో 45 ఏళ్ల మహిళ పడి చనిపోయింది. బుధవారం రాత్రి 9:20 గంటలకు ఈ సంఘటన జరిగిందని BMC అధికారులు తెలిపారు. మహిళను విమల్ గైక్వాడ్‌గా గుర్తించారు. ముంబై అగ్నిమాపక దళం ఆమెను వెళికి తీసి ఆసుపత్రికి పంపగా, అప్పటికే మహిళ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్