పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన కురుస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని వివిధ జిల్లాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. అనేక ఇళ్లు కూలిపోయాయని, చాలా చోట్ల తీవ్ర నష్టం వాటిల్లిందని విపత్తు నిర్వహణ ప్రతినిధి అన్వర్ షాజాద్ తెలిపారు. దీంతో గడిచిన 24 గంటల్లో 8 మంది చిన్నారులు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని షాజాద్ తెలిపారు.