ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్లో ఇద్దరు కెప్టెన్లకు ఫైన్ పడింది. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. నిర్ణీత సమయానికి బౌలింగ్ వేయకపోవడంతో బీసీసీఐ రూ.12 లక్షల చొప్పున ఎల్ఎస్జీ కెప్టెన్గా కేఎల్ రాహుల్, సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్లకు ఫైన్ విధించింది. ఈ మ్యాచ్లో చెన్నైపై 8 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది.