సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వరదలు రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వర్షాల కారణంగా అక్కడి మాంగన్ లో ఒకరు మరణించారు. మరో ఐదుగురు గల్లంతు అయ్యారు. వారి గురించి గాలింపు చర్యలు చేపట్టారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.