శ్రీలంకలో భారీ వర్షాలు..15 మంది మృతి

78చూసినవారు
శ్రీలంకలో భారీ వర్షాలు..15 మంది మృతి
శ్రీలంకలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ దేశ రాజధాని కొలంబోతో సహా 7 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇక్కడ 300మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. బలమైన ఈదురు గాలుల వల్ల చెట్లు, కొండచరియలు నేలకొరిగాయి. పలు ఘటనల్లో 15మంది మరణించారు. 5,000 కుటుంబాలకు చెందిన19,000మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్