అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికీ వరకు ప్రభుత్వ సొమ్ముతో విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రజాప్రతినిధులకు, ఉన్నతస్థాయి ఉద్యోగులకు గట్టి షాకిచ్చారు. జులై నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు తమ కరెంట్ బిల్లులను సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. తాను, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కూడ ఈ నిబంధనను అనుసరిస్తాని ఆయన తెలిపారు.