ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనపై తాము ఫిర్యాదు చేసినా అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోలేదంటూ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. దానం నాగేందర్ కు, న్యాయశాఖ కార్యదర్శి, స్పీకర్ కార్యాలయం, ఎన్నికల సంఘానికి కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.