తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా హిజ్రా

327430చూసినవారు
తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా హిజ్రా
తమిళనాడులో తొలిసారిగా రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు నియమితులయ్యారు. సింధు దిండుక్కల్‌ రైల్వే డివిజన్‌లో టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని, హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందని సింధు తెలిపారు. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా చదువుకోని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్