మైనారిటీలో హిమాచల్‌ సర్కారు..!

75చూసినవారు
మైనారిటీలో హిమాచల్‌ సర్కారు..!
హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. 68 మంది సభ్యులున్న హిమాచల్‌ అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 35 మంది సభ్యులు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి 34 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్