కంటతడి పెడుతున్న ఉద్యాన పంట రైతులు

50చూసినవారు
కంటతడి పెడుతున్న ఉద్యాన పంట రైతులు
ఏపీలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. ఏకదాటిగా కురిసిన వర్షాలకు పంట పొలాలు చెరువులని తలపిస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు, బెళుగుప్ప మండలం, అంకంపల్లి, దుద్దేకుంట గ్రమాల్లో ఉద్యాన పంటలు నేలకొరిగాయి. బొప్పాయి, అరటి తోటలు నేలమట్టం అయ్యాయి. దీనితో లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్