తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంపెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న వెంకన్నను 73,023 మంది భక్తులు దర్శించకోగా, 26,942 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.