గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని
భారత్ స్వాగతించింది. దీన్ని ఒక సానుకూల చర్యగా అభివర్ణించింది. ఇజ్రాయెల్- హమాస్ వివాదం ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ సోమవారం జనరల్ అసెంబ్లీ సమావేశంలో అన్నారు.