బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

84చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి, ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కార్యాలయంలో నిర్వహించిన పూజలు, హోమం కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులు ఉగాది పంచాంగాన్ని చదివి వినిపించారు.