
చార్మినార్: జర్నలిజం కత్తిమీద సాము లాంటిది: ఎంపీ ఈటెల రాజేందర్
జర్నలిజం కత్తిమీద సాము లాంటిదని ఎంపీ. ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ చార్మినార్ ఏరియాలోని ఈ మిల్లట్ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ.. గతంలోనే జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లా అన్నారు. మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వివరిస్తా అన్నారు.