కలెక్టరేట్ ఎదుట మూసి పరివాహక ప్రాంత ప్రజల ధర్నా

56చూసినవారు
ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా మూసి పరివాహక ప్రాంత ప్రజలు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ నేత శ్రీనివాస్ మాట్లాడుతూ. మూసి సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి వారిని రోడ్డున పడేయడం సరికాదని అన్నారు. బఫర్ జోన్ లో పార్కులు, ఫ్లై ఓవర్లు ఎలా కడతారని ప్రశ్నించారు. ఈ ధర్నాలో మూసి పరివాహక ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్