మల్కాజిగిరి ఉప్పర్ గుడాలో శుక్రవారం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్నగర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు నాలుగు బోగీలు ఉప్పరుడాలో పట్టాల తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్లకు మరమ్మతులు చేపట్టారు. రైల్వే పోలీసులు అక్కడికి ఎవర్ని రానివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.