అధికారులతో కలిసి రైల్వే బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే

617చూసినవారు
గౌతమ్ నగర్ లోని రైల్వే బ్రిడ్జిని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. స్థానికంగా ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు త్వరలో ఆర్. యూ. బి నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా స్థల ప్రతిపాదనలు పరిశీలించి త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్