ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న డిసిఎం... వ్యక్తి మృతి

69చూసినవారు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచర్లలో ద్విచక్ర వాహనాన్ని డిసిఎం వాహనం ఢీకొన్నది. బైక్ పై ఉన్న బొమ్మ రాములు(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బోడుప్పల్ లోని ఇందిరానగర్ కి చెందిన బొమ్మ రాములు, చెంగిచెర్లలోని మేకల మండిలో పనిచేస్తున్నారు. మేకల మండి నుండి వస్తున్న క్రమంలో చెంగిచర్ల హెచ్ పి పెట్రోల్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్