బీజేపీ నుంచి ఈటల రాజేందర్, ఈటల జమునల నామినేషన్ దాఖలు

67చూసినవారు
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి రోజు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం బీజేపీ అభ్యర్థులుగా ఈటల రాజేందర్, ఆయన సతీమణి ఈటల జమునలు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా మేడే సత్యం, స్వతంత్య్ర అభ్యర్థులుగా పాలది పవన్ కుమార్, బేగరి లోకేష్, చిలకా చంద్రశేఖర్, మలోతు శంకర్ లు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి గౌతమ్ పోట్రు తెలిపారు.

సంబంధిత పోస్ట్