లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సాయం నిధుల జమపై క్లారిటీ ఇచ్చింది. జూన్ 4 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, ఆ వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పీఎం కిసాన్లో భాగంగా రైతులకు రూ.6 వేల చొప్పున మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.