తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని పీర్జాదిగూడ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి తెలిపారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి సూచనల మేరకు వేడుకల నిర్వహణపై ఈరోజు బీఆర్ఎస్ కార్యాలయంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షకార్యదర్శులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.