చేపల వేటకు వెళ్లి అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

542చూసినవారు
మేడ్చల్ జిల్లా ముడిచింతలపల్లి మండలం కొల్తూరుకి చెందిన గుర్రాల స్వామి, కొండా అశోక్, దొరవారి కృష్ణ, ముగ్గురు కలిసి మల్కచెరువులో శనివారం చేపలు పట్టడానికి వెళ్లారు. కొండ అశోక్ దొరవారి కృష్ణ ఇంటికి తిరిగి వచ్చేశారు. గుర్రాల స్వామి మాత్రం ఇంటికి రాలేదు. చుట్టుపక్కల తెలిసిన ప్రాంతాల వద్ద ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. సోమవారం మలక చెరువులో శవం తేలియాడుతూ కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్