నాచారం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

60చూసినవారు
నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న యువతిని గ్యాస్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్