మోండా మార్కెట్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనాథ్ ను మంగళవారం మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. మోండా మార్కెట్ లోని అయన నివాసానికి వెళ్ళి ఇటీవల అనారోగ్య బారిన పడడంతో ఆయన ఆరోగ్యానికి సంభందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు.