అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు

64చూసినవారు
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతుంది. అవతరణ ఏర్పాట్లను సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు శుక్రవారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిశీలించారు. జూన్ 2 ప్రభుత్వ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రానున్నారు. సుమారు 20 నుంచి 25 వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 1860 మంది వీవీఐపీలు, 11వేల మంది సామాన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

సంబంధిత పోస్ట్